నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

ఎస్ఐ నాగార్జునరెడ్డి హెచ్చరిక

ఇందుకూరుపేటలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

  • ఎస్ఐ నాగార్జునరెడ్డి హెచ్చరిక
  • ఇందుకూరుపేటలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఎస్ఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి..వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా…లేదా…డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ తదితర తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులందరూ తప్పని సరిగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *