ప్రతీ ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి

ఆర్ సీఎం చర్చి విచారణ గురువు మంద సునీల్ కుమార్

సీతారామపురంలో భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే వేడుకలు

ప్రతీ ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి

  • ఆర్ సీఎం చర్చి విచారణ గురువు మంద సునీల్ కుమార్
  • సీతారామపురంలో భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే వేడుకలు

ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆర్ సీఎం చర్చ్ విచారణ గురువు మంద సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం అరుంధతియవాడ గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా గ్రామ పురవీధుల్లో సిలువ యాత్రను నిర్వహించారు. అనంతరం చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా విచారణ గురువు మంద సునీల్ కుమార్ మాట్లాడుతూ… ఏసు క్రీస్తూ శిలువలో ప‌లికిన ఏడు మాట‌లు ద్వారా క్షమా గుణం,బాధ్యత‌, ప్రేమ‌,ద‌యా గుణాల‌ను అల‌వ‌ర్చుకోవాల‌న్నారు. పాపుల కోస‌మే ఏసూ క్రీస్తు ఈ లోకంలో జ‌న్మించి,శిలువ‌లో ర‌క్తం చిందించి ప్రాణాలు అర్పించిన‌ట్లు తెలిపారు. పాప‌పు జీవితాన్ని వ‌ద‌లి క్రీస్తు చూపిన మార్గంలో న‌డవాలని బోధించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *