కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి

లింగంపల్లి తోపు వద్ద ఘ‌ట‌న‌

కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి

  • లింగంపల్లి తోపు వద్ద ఘ‌ట‌న‌

కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోగు పెంచలయ్య రాత్రి భోజనం తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న చెలికా పెంచలయ్య అలియాస్ చిన్న, సంపూర్ణ దంపతులు ఒక్క‌సారిగా వ‌చ్చి అతని కళ్ళల్లో కారం కొట్టి దాడి చేశారు. అల్యూమినియం బీడింగ్ తో నెత్తిపై బలంగా మోదడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడు పిల్లిపోగు పెంచలయ్యను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య చికిత్స అందించారు. బాధితుడి తలపై ఐదు కుట్లు పడ్డాయి. ఈ మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *