మృతురాలు చెంచమ్మకు రహస్యంగా ఖననం..?
మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోన్న స్థానికులు
కోడూరులో దారుణ ఘటన
విద్యుత్ షాక్ కు నిండు గర్భిణి బలి…
- మృతురాలు చెంచమ్మకు రహస్యంగా ఖననం..?
- మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోన్న స్థానికులు
- కోడూరులో దారుణ ఘటన
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామపంచాయతీలో చంచమ్మ అని నిండు గర్భిణీ బుధవారం రాత్రి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు… అల్లిపురంకు చెందిన లక్ష్మీనారాయణ కోడూరు గ్రామపంచాయతీలో రొయ్యల గుంటలను కౌలుకు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ వద్ద గిరిజన కుటుంబానికి చెందిన పోలయ్య తన కుటుంబంతో కలిసి కాపలాదారులుగా ఉంటున్నాడు. గుంటల వద్ద భద్రత కొరకు యజమాని ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కు విద్యుత్ సరఫరా వచ్చేలా కనెక్షన్ ఇవ్వడంతో అది గమనించని పోలయ్య భార్య ఫెన్సింగ్ తగిలి శరీరం పూర్తిగా కాలి మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటన పొద్దుపోయిన తర్వాత యజమాని గమనించడంతో గుట్టుగా ఎవరికి అనుమానం రాకుండా హుటాహుటిన మృతదేహాన్ని తరలించి ఖననం చేసినట్లు తెలుస్తుంది. మృతి చెందిన చంచమ్మకు ఇద్దరు పిల్లలు… ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణిగా తెలుస్తుంది. ఈ పేద గిరిజన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పలువురు గిరిజన సంఘాలు ఎస్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చెంచమ్మను రహస్యంగా ఖననం చేయడానికి విద్యుత్ షాక్ కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.