పట్టపగలు ఇంటికి తాళం వేసి ఉంటే కన్నం..

నాలుగు ఇళ్లల్లో వరుస చోరీలు – ఉపాధ్యాయుల ఇళ్లే లక్ష్యం

60 సవర్ల బంగారం, రూ.60 వేలు నగదు అపహరణ

కావలి పట్టణంలో కలకలం

పట్టపగలు ఇంటికి తాళం వేసి ఉంటే కన్నం…

  • నాలుగు ఇళ్లల్లో వరుస చోరీలు
  • ఉపాధ్యాయుల ఇళ్లే లక్ష్యం
  • 60 సవర్ల బంగారం, రూ.60 వేలు నగదు అపహరణ
  • కావలి పట్టణంలో కలకలం

పగలైతేనేం… రాత్రయితేనేమి.. ఇంటికి తాళం వేశారా.. బ్లైండ్ గా కన్నం వేస్తాం అంటూ దొంగలు కావలి పోలీసులకు సవాల్ విసిరారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి నాలుగు ఇళ్లలో వరుసగా చోరీలు జరిగిన ఘటనలు కావలి పట్టణంలో కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అలర్టయ్యారు. ఒక పక్క చోరీలు జరిగిన ఇళ్ల వద్ద పరిశీలన చేస్తూనే దొంగల ఆచూకీపై జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖను అలెర్ట్ చేశారు. కావలి పట్టణంలో జరిగిన చోరీలు వెంగళరావు నగర్, జనతాపేటలోని ఉపాధ్యాయుల ఇళ్లీ కావడం గమనార్హం. సౌత్ జనతాపేటలో ఉపాధ్యాయుడు ప్రతాప్, ఈ ప్రాంతంలోనే సురే మాలకొండ రెడ్డి, ఇందిరా నగర్ లోని ఉపాద్యాయిని లలితమ్మ, నార్త్ జంతాపేటలోని శోభన్ బాబు అనే వారి నివాసంలో చోరీలు జరిగాయి. మాలకుండా రెడ్డి ఆధార్ అప్ డేట్ కోసం ఇంటికి తాళం వేసి వెళ్ళి వచ్చేలోపలే చోరీ జరిగింది. వీరింటిలోనే 40 సవర్ల బంగారం, 40 వేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు తెలుస్తుంది. మిగిలిన 20 సవర్ల బంగారం, మరో 20 వేల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. చోరీలకు పాల్పడిన దొంగలు కారులో వచ్చినట్లు సమాచారం. కొందరు దొంగలను పొద్దుటూరు వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది. వీరే కావలిలో చోరీలకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *