జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు
జిల్లాలో చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ససమావేశంలో పాల్గొన్న
మంత్రి, ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘం అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు
ప్రశాంతంగా ఐఏబీ…
- జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు
- జిల్లాలో చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం
- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
- కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ససమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘం అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ, నీటిసంఘాల అధ్యక్షులు, రైతుసంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమశిల, కండలేరు జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు, ఎంతమేర రబీ పంటకు నీటిని కేటాయించాలి, చెన్నై, తిరుపతికి తెలుగుగంగ ద్వారా నీటి కేటాయింపులు, సాగునీటి కాలువల నిర్వహణ, పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు, లస్కర్లకు జీతాల బకాయిల చెల్లింపు మొదలైన అంశాలపై మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు, జిల్లాలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులు ప్రధానంగా చర్చించారు. మొత్తానికి ఐఏబీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది.