నేటి వార్త మాలిక‌

కల్తీలేని వార్త‌లు-క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. జిల్లాలో రెండో పంటకి సంబంధించిన నీటి కేటాయింపులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చర్చించారు.

అయ్యప్పగుడి సెంటర్ వద్ద నూతన ఏసీ బస్టాండ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్థానిక దివ్యాంగులచేత బస్టాండ్ ను ప్రారంభోత్సవం చేయించారు

భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనే టీటీడీ దోపిడీకి గురైందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. నాస్తికుడైన ఆయన గోమాత గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

సంగంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కలిగిరి నుంచి నెల్లూరు వెళుతున్న కారు సంగం మలుపు వద్ద అతివేగంతో వచ్చి కల్వర్ట్ ని ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో ఒక్క సారిగా కారులో మంటలు వ్యాపించాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కోవూరులో జేబీఎస్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పిల్లలు బడికి…పెద్దలు పనికి..పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండంటూ..నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఉదయగిరి ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల మీద ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతున్నార‌ని వారు విమ‌ర్శించారు.

సంగంలో రోడ్డు ప్రమాదానికి గురైన కారుని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వింజమూరు పంచాయతీ పరిధిలోని జీబీకేఆర్ ఎస్టి కాలనీకి చెందిన రావూరి కిషోర్ విద్యుత్ షాక్ కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ అభాగ్యుడుని ఆదుకునేందుకు కలిగిరి వాసులు ముందుకువచ్చారు. బాధిత కుటుంబానికి వారు రూ. 10వేలు ఆర్దిక సాయం అందచేశారు.

వింజమూరులోని ఎస్ బీఐ బ్యాంకు ప్రాంగణంలో మదర్ థెరీస్సా మిరాకిల్ ఫౌండేషన్ అధ్యక్షులు శాంసన్ వారి మిత్ర బృందం చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంబించారు.

గత తొమ్మిది నెలలుగా ఉచిత రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని ఇందుకూరుపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సక్రమంగా సరుకులు అందేలా చూడాలని వారు తహసీల్దార్ కి వినతి పత్రం అందచేశారు.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు కావాల్సిన వసతులు సమకూరుస్తున్నామని టీడీపీ నేత బండి కిరణ్ కుమార్ తెలిపారు. కొడవలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *