నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అరుదైన చికిత్స విజయవంతం
మీడియా సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వెల్లడి
5 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన మెడికవర్ వైద్యులు
- నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అరుదైన చికిత్స విజయవంతం
- మీడియా సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వెల్లడి
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో 5 ఏళ్ల బాలికకు అతి క్లిష్ఠమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడామని వైద్యులు వెల్లడించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుందన్నారు. దీనిపై నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తీవ్రమైన దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న 5 ఏళ్ల బాలికను వారి కుటుంబసభ్యులు మెడికవర్ హాస్పిటల్ కు తీసుకురాగా తమ వైద్య బృందం బాలికను పరీక్షించి, ఛాతిని స్కానింగ్ చేయడం జరిగిందన్నారు. స్కానింగ్ లో ఎడమవైపు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగానికి సిఫార్సు చేసినట్లు డాక్టర్ కౌశిక్ రెడ్డి తెలియజేశారు. ఈ శస్త్ర చికిత్స ఎంతో క్లిష్టమైందని, గింజ గట్టిగా ఇరుక్కుపోవడంతో శ్వాస మార్గం పూర్తిగా పూడుకుపోయిందని, శస్త్ర చికిత్స ద్వారా ఊపిరితిత్తిని తిరిగి యధాతథంగా మార్చగలిగామని ఆయన తెలిపారు. చిన్నపిల్లలతో పాటూ పెద్ద వయస్సు వారికి కూడా శ్వాస కోశ సంబంధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించేందుకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటూ అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ ఉదయ్ కీర్తి (పీడియాట్రిక్ ) డాక్టర్ రంగనాథ్, మెడికల్ సూపరింటెండెంట్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.