నెల్లూరులో కలకలం రేపుతున్న వివాహిత దారుణ హత్యకు
రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు
ఆరు నెలలు గడవక ముందే…
- నెల్లూరులో కలకలం రేపుతున్న యువతి దారుణ హత్యకు
- రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు
నెల్లూరులో ఓ యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది…పెళ్లి అయి ఆరు నెలలు గడవక ముందే…తన కూతురిని అల్లుడు, వారి కుటుంబ సభ్యులే చంపేశారని…యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కుమార్తెకి న్యాయం జరగాలని.. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ… నెల్లూరురూరల్ పోలీసుస్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితుల్ని ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు… నవాబుపేటకి చెందిన దళిత యువత స్మైలీని మూడో మైలుకి చెందిన నాగూర్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం ప్రేమించి..ఆ తరువాత ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్మైలీ నగరంలోని ఓ ల్యాబ్ లో టెక్నిషియన్ గా పని చేస్తుండగా, నాగూర్ మఠన్ షాపులో కట్టర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి తన కుమార్తెని చిత్ర హింసలకు గురి చేశారని చంపేశారని ఆరోపించారు. వెంటనే పోలీసులు విచారించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం యువతి తల్లి, ఎమ్మార్పీఎస్ నేత పందింటి సుబ్బయ్యలు మీడియాతో మాట్లాడారు.