అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష
పాల్గొన్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు
ప్రశాంతంగా ముగిసిన సర్వసభ్య సమావేశం
- అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష
- పాల్గొన్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక MPDO కార్యాలయంలో జరిగింది. ఎంపిపి గంగవరం సుగుణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా అమలులో ఉన్న పధకాలు, ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం పలువురు ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ లు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగమణి మాట్లాడుతూ… ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి రాబోయే వేశవిలో త్రాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ సబ్యుడు బందెల వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ స్వప్న, ఏవో శివభాస్కర్ రావు,గ్రామ సర్పంచ్ లు ఆలపాక శ్రీనివాసులు, కావలి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.