దారి లేకనే నిండు ప్రాణం బలి
పొంతన లేని సమాధానాలు చెబుతున్న అధికారులు
మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ
నామవరంలో విషాదఛాయలు – బోరున విలపిస్తోన్న కుటుంబ సభ్యులు
బాధ్యులెవరు…?
- దారి లేకనే నిండు ప్రాణం బలి
- పొంతన లేని సమాధానాలు చెబుతున్న అధికారులు
- మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ
- నామవరంలో విషాదఛాయలు
- బోరున విలపిస్తోన్న కుటుంబ సభ్యులు
కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు భారీ ఈదురు గాలులకు భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోవడంతో నామవరానికి చెందిన మహిళ మృతి చెందిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు….నామవరం గ్రామంలో మహిళకు విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో అంబులెన్స్ కు విషయం తెలియపరిచిన వెంటనే అంబులెన్స్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొంది. పేషెంట్ ని జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే క్రమంలో భారీ వృక్షం అబ్బుగూడెం సమీపంలో రోడ్డు అడ్డంగా పడిపోయింది. దీనివల్ల వేరే మార్గంలో అంబులెన్స్ డ్రైవర్ ఎట్టకేలకు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రహదారి బాగున్నుంటే తన భార్య బ్రతికుండేదని భర్త దీనస్థితిలో ఉండిపోయాడు. దీనిపై ఎన్ న్యూస్ ప్రతినిధి సంబంధిత అధికారుల్ని వివరణ కోరగా…అది మాకు సంబంధం లేదు…అది నా పరిధి కాదు….అదంతా ఆర్ అండ్ బీ అధికారులకే సంబంధం అంటూ మాటను దాట వేశారు. ఏది ఏమైనా…అధికారుల నిర్లక్షం కారణంగానే…ఓ నిండు ప్రాణం బలైపోయిందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.