నేటి వార్త మాలిక
కరోనా ఆనందయ్య మందు కేసులో…ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…మాజీ మంత్రి కాకాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి యాక్టివిస్ట్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి లు బాలాజీనగర్ పోలీసులకి వినతి పత్రం అందచేశారు.
తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వారు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సోమశిల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జీవితంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదని మీడియా సమావేశంలో విమర్శించారు.
కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో సీతారామ ప్రాజెక్టు కాలువలో కృంగి కూలిపోయిన వంతెనను సిపిఐ ఎంఎల్, మాస్ లైన్, ప్రజాప్రందా పార్టీల నేతలు పరిశీలించారు. దీనికి అధికారుల లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవకుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
చికెన్ వేస్ట్ వ్యర్ధాలపై కోవూరు పోలీసులు, ఎఫ్ డీవో అధికారులు దాడులు చేశారు. జాతీయ రహదారిపై వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. వేస్ట్ వ్యర్ధాలను పెన్నానదిలో గుంత తవ్వి పూడ్చేశారు.
ఆప్కాస్ రద్దు చేయాలని కోరుతూ…కావలి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పాలనే ఆలోచన విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట పలువురు దళితులు సీపీఎం నేతలతో కలిసి నిరసన చేపట్టారు. గతంలో తమకు మంజూరైన స్థలాలను ఓ నేత ఆక్రమించారని 20 రోజులుగా బుచ్చినాయుడుకండ్రిగలో రిలేదీక్షలు చేస్తున్నా అధికారుల్లో స్పందన లేదని వాపోయారు. తమరైన స్పందించి న్యాయం చేయాలని వారు ఆర్డీవోకు విన్నవించారు.