ఎన్ఆర్ఐ పల్లం శంకర్ హామీ
విడవలూరు హరిజనవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఘనంగా జయంతి వేడుకలు
దళిత యువతకు ఉద్యోగాలిస్తా..!!
ఎన్ఆర్ఐ పల్లం శంకర్ హామీ
విడవలూరు హరిజనవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఘనంగా జయంతి వేడుకలు
కోవూరు నియోజకవర్గం.. విడవలూరు హరిజనవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ కమిటీ ఛైర్మన్ గోళ్ల జయరాజ్ ఆధ్వర్యంలో.. ఎస్సై తురక వెంకటరమణ అలియాజ్ గబ్బర్ సింగ్ సహకారంతో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ పల్లం శంకర్, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావుతోపాటు జయరాజ్ హాజరై.. విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారంతా అంబేడ్కర్ గొప్పతనాన్ని.. ఆయన దేశానికి, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను వివరించారు. విడవలూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు గత మూడు దశాబ్ధాలుగా ఎవరూ సహకరించాలేదని.. ఈవిషయం తెలుసుకున్న ఎస్సై వెంకటరమణ ముందుకొచ్చి.. విగ్రహాన్ని డొనేట్ చేశారన్నారు. అలాగే.. పల్లం శంకర్ పెట్టబోయే ఫ్యాక్టరీలో.. తమ 50 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అందుకు స్పందించిన శంకర్ మాట్లాడుతూ.. విడవలూరు హరిజనవాడకు చెందిన యువత, నిరుద్యోగులకు కిసాన్ సెజ్లో 600 నుంచి వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు కల్పించేలా తాను పెట్టబోయే ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని.. అదీ..చిన్న చిన్న లేబర్.. సూపర్వైజింగ్ పనికాకుండా.. ఈ 50 మంది యువతకు మేనేజ్మెంట్లో ఉద్యోగం కల్పిస్తానని.. శంకర్ హామీ ఇచ్చారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగిస్తూ.. సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.