భయాందోళనలో సూళ్లూరుపేట ప్రజలు
విపరీతమైన కాలుష్య కోరల్లో సూళ్లూరుపేట
డంపింగ్ యార్డ్లో మళ్లీ మంటలు
- భయాందోళనలో సూళ్లూరుపేట ప్రజలు
- విపరీతమైన కాలుష్య కోరల్లో సూళ్లూరుపేట
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో సోమవారం మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో సూళ్లూరుపేట ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో ఇది రెండోసారి జరగడం గమనార్హం. జాతీయ రహదారికి అనుకుని ఉండటంతో దట్టమైన పొగ వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పొగ, దుర్వాసన వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితిలో ఉన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోతే భవిష్యత్లో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అఖిలభారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు సంయుక్తంగా చర్యలు చేపట్టే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.