కాకాణిపై అక్రమ కేసులు బనాయించడం దారుణం
కూటమి పాలనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ధ్వజం
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం…
- కాకాణిపై అక్రమ కేసులు బనాయించడం దారుణం
- కూటమి పాలనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ధ్వజం
నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ,మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై నమోదైన కేసుల గురించి కీలక విషయాలు మాట్లాడారు.. ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనేదానికి నిదర్శనం… జిల్లాలో ప్రజల సమస్యలపై మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించడమే అని ఆరోపించారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని… కాకాణిపై పెట్టిన కేసులు నిలవవని, కూటమి నేతలు నెల్లూరు జిల్లా,తిరుపతి జిల్లాల్లో ఎక్కడ చూసినా అక్రమ మైనింగ్ చేస్తూ వైసిపి వారు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.