ఇంటర్లో సత్తా చాటిన ప్రహ్లాద్కుమార్
1000 గాను 988 మార్కులతో పొదలకూరు మండల ప్రధమ ర్యాంక్
ప్రహ్లాద్ను అభినందించిన అధ్యాపకులు, వక్తలు
ఇంటర్లో సత్తా చాటిన ప్రహ్లాద్కుమార్
- 1000 గాను 988 మార్కులతో పొదలకూరు మండల ప్రధమ ర్యాంక్
- ప్రహ్లాద్ను అభినందించిన అధ్యాపకులు, వక్తలు
ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించాడు. 1000 గాను 988 మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సోమవారం ప్రహ్లాద్కుమార్ను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి, చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉన్నత స్థాయి విద్యకు నెల్లూరుకు వెళ్లే అవసరం లేకుండా పొదలకూరులోనే అందుబాటులోకి తీసుకొస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. బోధనలో ఉత్తమ ప్రతిభ చూపిన అధ్యాపకులను యాజమాన్యం సన్మానించింది.