నెల్లూరురూరల్ను రోల్మోడల్గా తీర్చిదిద్డడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి
బాలాజీ నగర్లో కన్నులపండువగా కొనసాగిన రాములోరి రథోత్సవం
ప్రజాసేవే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం
ప్రశాంతంగా గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలు
సూళ్లూరుపేటలో అర్ధరాత్రి గస్తీ నిర్వహించిన పోలీసులు
అపోహలు వీడితేనే సంపూర్ణ ఆరోగ్యం క్యాన్సర్పై అవగాహన సదస్సు
నెల్లూరురూరల్ను రోడ్మోడల్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు వేదాయపాలెం వద్ద గాంధీనగర్ రోడ్డుకు సంబంధించిన పనులను ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. త్వరలో 2 కోట్ల 70 లక్షల నిధులతో గాంధీనగర్ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు.
నెల్లూరు బాలాజీనగర్లో సీతారాముల రథోత్సవం వైభవంగా కొనసాగింది. రథోత్సవంలో నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. రాములోరి రథోత్సవం భక్తులతో కలిసి కోటంరెడ్డి సెప్టులేసి భక్తులను ఉత్సాహపరిచారు. కుటుంబంతో కలిసి రూ.2 లక్షల విలువైన వెండిని శ్రీరామునికి అందజేశారు. అందరిపై శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
నెల్లూరు జీఎన్టి రోడ్డులో ప్రముఖ సంఘసంస్కర్త డొక్కా సీతమ్మ స్పూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొని చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
సంగం మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. 184 మందిలో 81 మంది పరీక్షకు హాజరవుగా.. 103 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద ప్రిన్సిపల్ సుమతి అన్ని మౌలిక వసతులు కల్పించారు.
ప్రజల భద్రత కోసం రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తెలియజేశారు. సూళ్లూరుపేటలో ఆయన తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. రాత్రి సమయంలో ఎటువంటి కారణం లేకుండా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాపూరు మండల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా కాలేజిల అధ్యాపకులు అభినందించారు.
కృష్ణపట్నం గ్రామంలో తత్వజ్ఞ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ తిరుమల వైద్య శిబిరంలో ఉచితంగా పలువురికి మందులను అందజేశారు. బిపి, షుగర్, తదితర వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
నెల్లూరు చిల్డ్రన్స్పార్క్ వద్ద నారాయణ మెడికల్ కాలేజి వారి సహకారంతో ది నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన కలిగి ముందుజాగ్రత్తలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండవచ్చని ది నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. క్యాన్సర్ వైద్య నిపుణులు మనోబిరం, రత్నప్రియ పాల్గొని వైద్యపరీక్షలు నిర్వహించారు.
పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదొరువు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు జరిగాయి. దేవస్థాన ప్రధాన అర్చకులు పరంకుశం రంగనాదాచర్యలు స్వామి ఆధ్వర్యంలో పల్లకీసేవ నిర్వహించి మహిళలు సామూహిక హారతులు సమర్పించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు
మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోనీ సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన వీధులలో క్రైస్తవులు పాటలు పాడుతూ, సంఘ స్థాపకులు బూదూరు అబ్రహం ప్రార్థనలు నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. ఏసుప్రభు సందేశాన్ని చర్చి పాస్టర్ కొఠారూ టెర్తులియన్ పాల్ తెలియజేశారు.
రాపూరులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో వార్షిక వసంత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు నవకళశ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఘనంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కుప్పం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవం వేద పండితులతో అతి వైభవంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.