ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో కావలి టౌన్ ఫస్ట్
తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపిన కళాశాల డైరెక్టర్
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభినందనలు
ఇంటర్ ఫలితాల్లో శ్రీ వశిష్ఠ సత్తా
ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో కావలి టౌన్ ఫస్ట్
తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపిన కళాశాల డైరెక్టర్
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభినందనలు
ఇంటర్ సీనియర్, జూనియర్ ఫలితాల్లో కావలి శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల వరుసగా నాల్గో సంవత్సరం సత్తా చాటినట్లు కళాశాల డైరెక్టర్ కోటా సురేంద్ర రెడ్డి తెలిపారు. ఆదివారం కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కోటా సురేంద్ర రెడ్డి N3 న్యూస్ తో మాట్లాడారు. కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ప్రతి సంవత్సరం కావల పట్టణంలో మొదటి స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతున్నట్లు తెలిపారు. శనివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లోనూ సీనియర్ ఎన్టీఆర్ ఎంపీసీలో 991 మార్కులతో లక్ష్మీ హరిత టౌన్ ఫస్ట్, 990 మార్కులతో సౌమ్య టౌన్ సెకండ్ సాధించారన్నారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 466 మార్కులతో పూజిత చౌదరి టౌన్ ఫస్ట్, సీఈసీలో శ్రీవల్లి 484 మార్కులతో టౌన్ ఫస్ట్ గా నిలిచారన్నారు.