అదుపులోకి తీసుకున్న ఆత్మకూరు పోలీసులు
వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన సీఐ గంగాధర్
గొలుసు దొంగలు అరెస్ట్
- అదుపులోకి తీసుకున్న ఆత్మకూరు పోలీసులు
- వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన సీఐ గంగాధర్
ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని బంగారు గొలుసులు చోరీ చేసే దొంగలను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఓ బంగారు చైను రికవరీ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. కోవూరు పట్టణం స్టవ్ బీడీ కాలనీకి చెందిన పటాన్ కాసిం,దేవరకొండ శివ అనే ఇద్దరు వ్యక్తులు గత సంవత్సరం పాత జంగాలపల్లి వద్ద ఓ వృద్ధ మహిళను టార్గెట్ చేసుకొని ఆమె మెడలో ఉన్న బంగారు చైను తెంచుకొని పరారయ్యారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ జిలాని నిందితుల కదలికలను తెలుసుకొని పటాన్ కాసింతో పాటు నిందితులకు సహకరించిన పటాన్ రహీం అనే వ్యక్తిని నెల్లూరు పాలెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ విలువ కలిగిన వస్తువులు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. అలానే వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లే క్రమంలో తగిన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తో పాటు ఎస్సైలు జిలాని,సాయి ప్రసాద్, ఐడి పార్టీ చెన్నకేశవులు,హెడ్ కానిస్టేబుల్ జేమ్స్
కానిస్టేబుళ్లు విజయ్ కుమార్,అశోక్,సతీష్ కుమార్ పాల్గొన్నారు.