వ‌డ్డీతో స‌హా ప‌రిహారం అందిస్తాం

నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు రైతులు సహకరించాలి

భూసేక‌ర‌ణ రైతులతో గ్రామ స‌భ నిర్వ‌హించిన నెల్లూరు ఆర్డీవో అనూష

వ‌డ్డీతో స‌హా ప‌రిహారం అందిస్తాం
నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు రైతులు సహకరించాలి
భూసేక‌ర‌ణ రైతులతో గ్రామ స‌భ నిర్వ‌హించిన నెల్లూరు ఆర్డీవో అనూష

నెల్లూరు జిల్లా రాపూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో.. నెల్లూరు ఆర్డీవో అనూష ఆధ్వర్యంలో నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు సంబంధించి.. రాపూరు మండలంలో భూములు ఇచ్చిన 8 గ్రామాల రైతులతో గ్రామసభ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాలతో నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు భూములు ఇచ్చిన ఎనిమిది గ్రామాల రైతులు.. ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని తీసుకోకపోవడంతో వారి అందరికీ గ్రామ సభ ఏర్పాటు చేసి వారితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని రైతులకు తెలియజేసి, వడ్డీతో సహా వారంద‌రికీ ప‌రిహారాన్ని అందిస్తున్నామ‌న్నారు. రైతులందరూ ప్రభుత్వానికి సహకరించాలని, రైతుల సమస్యలను తెలుసుకుని.. అందరికీ న్యాయం చేస్తామని ఈసంద‌ర్భంగా ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూర్ ఎమ్మార్వో లక్ష్మీ నరసింహ, వీఆర్వో లు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *