సర్వే సమయంలో యజమానులు అందుబాటులో ఉండాలి
రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలి
కృష్ణపట్నం వాసులకు సూచించిన తహశీల్దార్ స్వప్న
కృష్ణపట్నంలో రీ సర్వే
- సర్వే సమయంలో యజమానులు అందుబాటులో ఉండాలి
- రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలి
- కృష్ణపట్నం వాసులకు సూచించిన తహశీల్దార్ స్వప్న
గ్రామంలో రీసర్వే జరిగే సమయాల్లో సంబంధింత యజమానులు అందుబాటులో ఉంటే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తహశీల్దార్ స్వప్న పేర్కొన్నారు. రెండవ షెడ్యూల్ లో కృష్ణపట్నం రెవెన్యూ లో త్వరలో రీ సర్వే చేసేందుకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో …. సర్వే పై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు తహసీల్దార్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వప్న మాట్లాడుతూ…భూముల రీసర్వే ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు చేపడుతున్నాట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులు సర్వే సమయంలో గ్రామంలో ఉంటారు కాబట్టి రెవెన్యూ సమస్యలు ఉంటే సరైన రికార్డులు తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిటీ శ్రీనివాసులు, సర్వేయర్ అనురూప్, తదితరులు పాల్గొన్నారు