అవగాహన, చైతన్యం, వైద్యం ఎంతో ముఖ్యం
నెల్లూరు అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుబాటులో
అపోలో వైద్యులు డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ రష్మీ, ముత్తరాజు శివశంకర్
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పర్కిన్సన్స్ వ్యాధి
-అవగాహన, చైతన్యం, వైద్యం ఎంతో ముఖ్యం
-నెల్లూరు అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుబాటులో
-అపోలో వైద్యులు డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ రష్మీ, ముత్తరాజు శివశంకర్
ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా.. నెల్లూరు అపోలో శుక్రవారం ఆసుపత్రి డైరెక్టర్.. మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆసుపత్రి న్యూరాలాజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ ,న్యూరాలాజిస్టులు డాక్టర్ రష్మీ, డాక్టర్ ముత్తరాజు శివ శంకర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతులలో పార్కిన్సన్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా అపోలో వైద్యులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ రష్మీ, ముత్తరాజు శివశంకర్లు మాట్లాడారు. ఈ వ్యాధిపట్ల ప్రజల్లో అవహాన పెంచడం, ముందస్తు గుర్తింపు, వ్యాధి ప్రాముఖ్యతను హైలెట్ చేయడం, సంరక్షణ ప్రాప్యతను మెరుగుపర్చడంతోపాటు రోగులు, సంరక్షకులు ఎదుర్కొంటున్న శారీరక, భావోద్వేగ, సామాజిక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టడం జరుగుతుందని ఈసందర్భంగా వారు వెళ్లడించారు. ముఖ్యంగా దాని ప్రారంభ దశలలో.. వృద్ధాప్య జనాభాతో, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వేగంగా పెరుగుతోందని.. దీని ప్రాబల్యం పెరుగుతున్నప్పటికీ.. అవగాహన, రోగ నిర్ధారణ, దీర్ఘకాలిక నిర్వహణలో గణనీయమైన వ్యత్యాసం ఉందని వారు తెలియజేశారు. పార్కిన్సన్స్ బారిన పడిన వారికి మద్దతు ఇవ్వడంతోపాటు దాని కారణాలు, నివారణపై పరిశోధనను ప్రోత్సహించే కరుణ, సమాచారం ఉన్న సమాజాన్ని సృష్టించడం దీని లక్ష్యం అన్నారు. అనంతరం ఆ వ్యాధిబారినపడ్డ కొందరు రోగులు తమ అనుభవాలను వెళ్లడించారు. ఈ సమావేశంలో.. అపోలో ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.