మా దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ వ‌క్ఫ్ ఆస్తులు

వాటి జోలికి వ‌స్తే.. ఊరుకోం

వ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ.. కోవూరులో నిర‌స‌న

మ‌తాల‌వారీగా చిచ్చుబెడుతున్న మోదీ ప్ర‌భుత్వం

మా దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ వ‌క్ఫ్ ఆస్తులు
వాటి జోలికి వ‌స్తే.. ఊరుకోం
వ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ.. కోవూరులో నిర‌స‌న
మ‌తాల‌వారీగా చిచ్చుబెడుతున్న మోదీ ప్ర‌భుత్వం

వ‌క్ఫ్‌బోర్డ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా.. కోవూరు మండల పరిధిలోని సాలుచింతల ప్రాంతంలోని మక్కా మజీద్ వ‌ద్ద మజీద్ ప్రెసిడెంట్ మన్సూర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అనంతరం మక్కా మజీద్ ప్రెసిడెంట్ మన్సూర్ మాట్లాడుతూ.. మా పెద్దలు మా దేవుడికి గిఫ్టుగా ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులు పై రాజకీయం చేయొద్దని తెలియజేశారు. మా తాత ముత్తాత‌లు..తండ్రులు, మేము ఇండియాలోనే పుట్టమన్నారు. మా ఆస్తులుపై.. మా సిద్ధాంతాల్లో దయచేసి జోక్యం కల్పించుకోవద్దని.. ఈసంద‌ర్భంగా వారు రాజ‌కీయ పార్టీల‌ను హెచ్చ‌రించారు. మోదీ ప్రభుత్వం మతాలవారీగా చిచ్చు పెట్టాలని చూస్తుందని.. వక్ఫ్‌ భూములను కాజేయడానికి కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు. స‌వ‌రణ‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసేవ‌ర‌కు.. ఊరుకోమ‌న్నారు. ఈ విష‌యంలో త్యాగాల‌కు సైతం వెనుకాడ‌బోమ‌ని ఈసంద‌ర్భంగా వారు హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *