సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతల ఫిర్యాదు
జగన్ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలపై మండిపాటు
- సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతల ఫిర్యాదు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీ నాయకుడు జెట్టి వేణు యాదవ్, పార్టీ ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు ఎస్సై బ్రహ్మనాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృపాకర్ రెడ్డి, చిన్ని సత్యం, మిజూరు రామకృష్ణారెడ్డి, అలవల సురేష్, అల్లూరు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.