గిరన్న త్వరగా కోలుకోవాలి..

టీడీపీ నేత మేఘనాథ్ సింగ్

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఎదుట 108 టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు

గిరన్న త్వరగా కోలుకోవాలి…

  • టీడీపీ నేత మేఘనాథ్ సింగ్
  • శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఎదుట 108 టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు

టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడి ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ…పార్టీ నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో…శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు 108 టెంకాయలు కొట్టి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘనాథ్ సింగ్ మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపట్టిన గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం ఎంత విజయవంతంగా సాగుతుందని చెప్పారు . ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న ఆయన త్వరగా కోలుకొని తిరిగి గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరుణమ్మ, గాలిమోష మీరాభాయి, సుబ్బారెడ్డి, మధురెడ్డి, సాయి, సూరి, వెంకటేష్, సురేష్, చంద్రమౌళి, కరిముల్లా, రహమతుల్లా, సుధారాణి, ఉమామహేశ్వరి రాజేశ్వరి ,లక్ష్మి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *