నీ కార్యకర్తలు చూశారా..టిడిపి నేత ఈశ్వర్ చౌదరి
అయ్యా చెవన్న దాడి చేయడం నువ్వు చూసావా
-నీ కార్యకర్తలు చూశారా..టిడిపి నేత ఈశ్వర్ చౌదరి
చిత్తూరు జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గం.. పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి భర్త టిడిపి నాయకుడు నంగా బాబు రెడ్డి, కుమారుని పై దాడి చేసి, బట్టలు చింపి, కారు అద్దాలు పగలగొట్టారని, పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీలకు పని కల్పించారని మాజీ ఎమ్మెల్యే తన బ్లూ మీడియా, వారి సోషల్ మీడియాలో వ్రాసిన కథనం పూర్తిగా అవాస్తవం అని టిడిపి నాయకుడు ఈశ్వర్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాకాల మండలం కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. టీడీపీపై అసత్య ఆరోపణలు చేయడం.. విబేధాలు సృష్టించడం మానుకోవాలని ఈసందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భఢాస్కర్రెడ్డికి హితవు పలికారు. మా పార్టీ నేతలు, కార్యకర్తలు దాడిచేయడం నీవుగాని.. నీ కార్యకర్తలుగాని చూశారా అని చెవిరెడ్డిని ప్రశ్నించారు. ఇంకా పలు విషయాలను ఆయన వెళ్లడించారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, నాయకులు టి.జె.ప్రవీణ్ కుమార్, కార్యదర్శి పల్గుణ కుమార్, పట్టణ అధ్యక్షుడు దేవరింటి మోహన చౌదరి, గోకుల్, రంజిత్ లు పాల్గొన్నారు.