సంగంలో సోలార్ పలకలను పరిశీలించిన విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు
సోలార్ ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
- సంగంలో సోలార్ పలకలను పరిశీలించిన విద్యుత్ శాఖ ఏఈ
నెల్లూరు జిల్లా సంగం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీధర్ రెడ్డి అనే కన్జ్యూమర్ ఏర్పాటు చేసిన సోలార్ పలకలను విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు పరిశీలించారు. సోలార్ వాడకం గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోలార్ ఏర్పాటు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈ మన్మధరావు మాట్లాడుతూ… ప్రభుత్వం సబ్సిడీ విధానంతో అందిస్తున్న సోలార్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్మెన్ వేణు స్థానికులు పాల్గొన్నారు.