మహిళలందరూ స్వశక్తితో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
జన నేతకు రూరల్లో బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు
అధికారులకు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని కాలనీ సమస్యలతో
అల్లాడుతోన్న కాలనీవాసులు
33 మందికి ప్రాణదానం చేసిన మధుసూదన్ రెడ్డి
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
సంగంలోని వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నెల్లూరురూరల్ టీడీపీ నేత చేపట్టిన గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. 1వ డివిజన్ కొత్తూరులో ఆయన టీడీపీ జెండాని ఆవిష్కరించి తెలుగు తమ్ముళ్ల సమక్షంలో భారీ కేక్ కట్ సంబరాలు చేసుకున్నారు.
సీతారామపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల కేంద్రంలోని రాజుగారికాలనీ సమీపంలో ఇల్లు అగ్నికి దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు,తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.
సంగంలోని సంగమేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు అశ్వవాహనం భక్తులకు దర్శనమిచ్చారు.
ఆ కాలనీలో అన్నీ సమస్యలే… అసంపూర్తిగానే ఇళ్ల నిర్మాణాలు…అభివృద్ధికి నోచుకోని రోడ్లు, డ్రైనేజీలు…చినుకు పడితే చాలు దారులన్నీ బురదమయం…తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు…ఆ కాలనీ ఎక్కడ…ఆ సమస్యలేంటి..? కాలనీ వాసులు పడుతున్న బాధలేంటో తెలుసుకోవాలంటే వాచ ద ఎన్ 3 న్యూస్…
ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలోని భూ వివాదంపై తహసీల్దార్ స్వప్న అధ్యక్షతన రెవెన్యూ కోర్ట్ నిర్వహించారు. ఈ కోర్ట్ లో గ్రామస్థుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
సంగంలోని పీహెచ్ సీ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి పైలేరియా వ్యాధి గ్రస్తులకు కిట్లు పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది పైలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యాధిగ్రస్తులకు తెలియచేశారు.
ఇందుకూరుపేటలో నారాయణ డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకి దంత వైద్య నిపుణులు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు.
3M కార్ కేర్ స్టూడియో అధినేత, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ చౌకచెర్ల సుధీర్ నాయుడు సౌజన్యంతో గాంధీనగర్లో శని భగవాన్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్, జనవారధి సొసైటీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మోపూరు భాస్కర్ నాయుడులు ప్రారంభించారు.
నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్లో మధుసూదన్రెడ్డి 33వ సారి అత్యవసర సమయంలో రక్తదానం చేశారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి రేర్ గ్రూప్ అయిన బొంబే ఫెనో టైప్ బ్లడ్ అవసరమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అన్నీ ప్రాంతాల్లో అడిగి చూశారు. ఎక్కడ లభ్యం కాకపోవడంతో వారు నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్నాయుడును సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రక్తాన్ని ఏర్పాటు చేశారు.
1989 నుండి నేటి వరకు తమ సాగు అనుభవంలో ఉన్న భూమి జివికే పవర్ కంపెనీ కి ఎలా బదలాయింపు జరిగిందో తెలియడం లేదని దిబ్బ మీద దళితవాడ గ్రామస్థులు వాపోయారు. ముత్తుకూరు మండలం పైనాపురం దిబ్బమీద దళిత వాడ గ్రామస్థులు తహశీల్దార్ స్వప్న కు వినతి పత్రం అందజేశారు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం, పరదాలు నడుమ వారి నివాసం, తాటాకు పందిరి తో ఆవాసం,ఇద్దరు చిన్నారులతో, సంతోషంగా గడుపుతున్న కుటుంబం…. కాయ కష్టం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ కుటుంబంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి…. ఇంటి పెద్ద దిక్కుకు పెద్ద కష్టమే వచ్చింది… విధి వారి జీవితంలో ఒక తీరని శోకాన్ని మిగిల్చింది… మంచానికి పరిమితమైన ఆ అభాగ్యుడినీ చూస్తే ఎవరికైనా కన్నీరు రాక మానదు.ఆ కుటుంబం పడుతున్న కష్టం తెలియాలంటే N3 న్యూస్ చూడాల్సిందే….