ఈహెచ్ ఎస్, ఈపీవోఎస్ ఫించన్లపై కార్మికులకు అవగాహన
వాకాడు ఆర్టీసీ డిపోని తనిఖీ చేసిన రీజనల్ మేనేజర్
- ఈహెచ్ ఎస్, ఈపీవోఎస్ ఫించన్లపై కార్మికులకు అవగాహన
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో ఆర్టీసీ డిపోను రీజనల్ మేనేజర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఈ హెచ్ ఎస్, ఈపీఓఎస్ పింఛన్ పై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన N3 న్యూస్ తో మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికులు హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్డ్ పెన్షన్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
మల్లం సుబ్రమణ్య స్వామి గుడి నుండి కనుపూరు ముత్యాలమ్మ తల్లి గుడికి స్పెషల్ బస్సులు వెయ్యాలని ఆయా గుడి చైర్మన్లు అడిగారని కచ్చితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వాకాడు డిపోకు నూతనంగా 13 బస్సులు వచ్చాయని… అవి సక్రమంగా తిరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.