అర్హత గల ప్రతీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందచేస్తాం
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
సంగం వెలుగు కార్యాలయంలో టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
ఉచితంగా 90 రోజులు టైలరింగ్ శిక్షణ…
- అర్హత గల ప్రతీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందచేస్తాం
- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- సంగం వెలుగు కార్యాలయంలో టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
నెల్లూరు జిల్లా సంగం వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు .ముందుగా అధికారులు,ప్రజా ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏడు ఉచిత టైలరింగ్ కేంద్రాలు మంజూరు కాగా, నాలుగు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, ఓసీలకు చెందిన మహిళలందరికీ ఉచితంగా 90 రోజులపాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నట్లు చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్క మహిళకు కూడా శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని, మహిళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, ఎంపీపీ పద్మావతమ్మ, జెడ్పీటీసీ రావుల లక్ష్మి,తహసీల్దార్ సోమ్లా నాయక్,ఎంపీడీఓ షాలెట్,స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.