నార్త్ రాజుపాళెం సెంటర్లో మానవహారం
కొడవలూరులో క్రైస్తవులు నిరసన ర్యాలీ…
- నార్త్ రాజుపాళెం సెంటర్లో మానవహారం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మృతికి నిరసనగా సెంటినరీ బాప్టిస్ట్ సంగం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించి, నార్త్ రాజుపాలెం సెంటర్ లో మానవహారం చేపట్టారు. క్రైస్తవ సోదరులు క్రైత్సవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం అంటూ , పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాజు , తువ్వర ప్రవీణ్ ,ప్రభాకర్, పాస్టర్ జాకబ్ సుధీర్, , స్థానిక సంఘ డాక్టర్ సి జొన్న తన్, నెహెమ్యా, ప్రదీప్, బండి అనిల్ కుంబ్లె, పెమామ్మారెడ్డి పాలెం సూర్య, కొడవలూరు మండలం నుంచి అన్ని సంఘాల పాస్టర్లు, సంఘస్తులు పాల్గొన్నారు.