సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షించిన పర్వతరెడ్డి
శ్రీరాముడి సేవలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
- సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ
- రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షించిన పర్వతరెడ్డి
నెల్లూరు నగరం 47 డివిజన్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్సీ, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నబజారులోని కోదండరామస్వామి ఆలయం, కుక్కలగుంటలోని శ్రీ కృష్ణ మందిరాలలో శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయన పాల్గొని సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. వేడుకలకి విచ్చేసిన పర్వతరెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని..స్వామి వారిని ప్రార్ధించానని పర్వతరెడ్డి తెలిపారు. కార్యక్రమాల్లో డివిజన్లోని వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.