20 ఎకరాల్లో మామిడి తోట దగ్ధం

బోరున విలపిస్తున్న తోట యజమాని

వింజమూరులో ఘటన

20 ఎకరాల్లో మామిడి తోట దగ్ధం…

  • బోరున విలపిస్తున్న తోట యజమాని
  • వింజమూరులో ఘటన

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం మోట చింతలపాలెం సమీపంలో 20 ఎకరాల మామిడి తోట దగ్ధం అయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఎండిపోయిన గడ్డిని అంటుకోవడంతో , కొన్ని మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో సుమారుగా ఏడు లక్షల నష్టం వాటిల్లందని మామిడి తోట యజమాని దొర్సానమ్మ తెలియజేశారు. ఈ మామిడి తోటను లీజుకు తీసుకొని సాగు చేస్తున్నామని, సుమారుగా 10 లక్షల మేర పెట్టుబడి పెట్టి ఉన్నామన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడం ఉన్న తీవ్ర నష్టం సంభవించిందని ఆమె లబోదిబో అంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేయడంతో కొంతమేర నష్టాన్ని అదుపు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వమే ఏదైనా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *