మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు – వాకాడులో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవం
బీజేపీ సమన్వయకర్త పాపారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
మోదీ అంటే అభివృద్ధి… అభివృద్ధి అంటే మోడీ
- మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు
- వాకాడులో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవం
- బీజేపీ సమన్వయకర్త పాపారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో గూడూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సమన్వయకర్త పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ, గూడూరు మాజీ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మండల నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. వెలగపల్లి వరప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే మోడీ అన్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ… బిజెపి నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల బిజెపి అధ్యక్షులు తూపిలి చంద్రారెడ్డి, వంకా రమణయ్య, చంద్ర గౌడ్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.