సమస్యల్లో…చెన్నూరు

ఎక్కడ చూసినా చెత్తే…ఎటు చూసినా మురుగునీరే

లబోదిబోమంటున్న గ్రామస్థులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

సమస్యల్లో…చెన్నూరు

  • ఎక్కడ చూసినా చెత్తే…ఎటు చూసినా మురుగునీరే
  • లబోదిబోమంటున్న గ్రామస్థులు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు…ఎటు చూసినా కాలువల్లో మురుగునీరు నిల్వలు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్యంలోనే…తూర్పు వీధి ప్రజలు జీవనం సాగిస్తున్నామని…మున్సిపల్ అధికారులకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు వాపోయారు. గత మూడు, నాలుగు రోజులైనా…ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందన్నారు. మెయిన్ రోడ్లోని బస్టాండ్ నుంచి గంగమ్మ ఆలయం వరకు మాత్రమే పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తున్నారని…ముస్లిం స్ట్రీట్ సీత వీధి, మిట్ట వీధి, గమల్లపాలెం తదితర ప్రాంతాలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వీటి కారణంగా…రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దోమలు దాడి చేస్తున్నాయని…డెంగ్యూ, మలేరియా తదితర విషజ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి… తూర్పు వీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎన్ 3 న్యూస్ తో తమ బాధను చెప్పుకున్నారు. వారేమన్నారో వారి మాటల్లోనే విందాం…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *