చిత్రపటానికి నివాళులర్పించిన డిప్యూటీ తహసీల్దార్
వాకాడులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
- చిత్రపటానికి నివాళులర్పించిన డిప్యూటీ తహసీల్దార్
తిరుపతి జిల్లా వాకాడు మండల రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తాసిల్దార్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ సిబ్బందితో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘బాబుజీ’ అని ముద్దుగా పిలువబడే ఆయన జీవితం, సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని డిప్యూటీ తహసీల్దాన్ అన్నారు. మహోన్నత వ్యక్తుల సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసు సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.