కావలి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, ఆర్డీవో, టీడీపీ నేతలు, ఎంఆర్పీఎస్ నాయకులు
బాబు జగజ్జీవన్ రామ్ స్థూపం భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ
పేద వారి అభ్యున్నతికి తపించాడు
- కావలి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
- ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, ఆర్డీవో, టీడీపీ నేతలు, ఎంఆర్పీఎస్ నాయకులు
- బాబు జగజ్జీవన్ రామ్ స్థూపం భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ
కావలి పట్టణంలో కేంద్ర మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ముసునూరులోని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన కార్యాలయం వద్ద జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి టిడిపి నాయకులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి 12వ వార్డు టిడిపి ఇంచార్జీ దావులూరి దేవకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి ఆర్డీవో వంశీ కృష్ణ, టీడీపీ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారి అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఆయన చనిపోయే వరకు తపించారన్నారు. అంటరాని తనం పోవాలని పోరాటం చేశారన్నారు. అణగారిన వర్గాలు ఐక్యంగా ఉంచేందుకు కృషి చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధునిక దేశానికి ఘనమైన సేవలు ఉంచారన్నారు. అతి తొందరలోనే బాబు జగజ్జీవన్ రామ్ స్థూపం, భవనం నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మలిశెట్టి వెంకటేశ్వర్లు , ఏగూరి చంద్రశేఖర్ , పొట్లూరి శ్రీనివాసులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.