రూ.275కోట్లు కూలీల‌కు చెల్లించాం

తిరుప‌తి జిల్లాలో కోటి 10 లక్షల ఉపాధి పని దినాలు

33 మండ‌లాల్లో సామాజిక త‌నికీలు

చిట్ట‌మూరులో గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంపై సామాజిక త‌నిఖీలు

ద్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ వెళ్ల‌డి

రూ.275కోట్లు కూలీల‌కు చెల్లించాం..!

-తిరుప‌తి జిల్లాలో కోటి 10 లక్షల ఉపాధి పని దినాలు
-33 మండ‌లాల్లో సామాజిక త‌నికీలు
-చిట్ట‌మూరులో గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంపై సామాజిక త‌నిఖీలు
-ద్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ వెళ్ల‌డి

తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో కోటీ పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని ద్వామపిడి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ సామాజిక త‌నిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీ మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 225 కిలోమీటర్లు పొడవున సిసి రోడ్లు.. బిటి రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. 275 కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు. 175 కోట్ల రూపాయల మేరకు పదాన్ని పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. జిల్లాలోని 33 మండలాల్లో ఆడిటింగ్ జరుగుతుందన్నారు. మ‌రో రెండు మండలాల్లో జరగాల్సి ఉందని, వచ్చేవారం ఆ మండలాల్లోనూ సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ గౌడ్, ఉపాధి హామీ ఏపీవోలు షీలా, చిన్నయ్య, టీ ఎ శరత్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *