వేస‌విలో జాగ్ర‌త్త‌లు తీసుకోండి..

ప్ర‌జ‌ల‌కి అవ‌గాహ‌న క‌ల్పించిన వాకాడు ఎస్ఐ నాగ‌బాబు

వాహ‌న‌దారులు, వృద్ధుల‌కి మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎన్ఐ

వేస‌విలో జాగ్ర‌త్త‌లు తీసుకోండి….

  • ప్ర‌జ‌ల‌కి అవ‌గాహ‌న క‌ల్పించిన వాకాడు ఎస్ఐ నాగ‌బాబు
  • వాహ‌న‌దారులు, వృద్ధుల‌కి మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎన్ఐ

వేస‌వి తీవ్ర రోజు రోజుకు పెరుగుతోంద‌ని…ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని…తిరుప‌తి జిల్లా వాకాడు ఎస్ఐ నాగ‌బాబు సూచించారు. ఈ సంద‌ర్భంగా త‌న కార్యాల‌యం వ‌ద్ద…వాహ‌న‌దారుల‌కి, ప్ర‌జ‌ల‌కి ఎండ తీవ్ర‌తలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై అవ‌గాహ‌న క‌ల్పించారు. అత్య‌వ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావాల‌ని… లేక‌పోతే రావ‌ద్ద‌ని తెలిపారు. వాహ‌న‌దారుల‌కి, వృద్ధుల‌కి ఆయ‌న మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంత‌రం ఎస్ఐ నాగ‌బాబు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌, మే నెల‌లో ఎండ తీవ్ర అధికంగా ఉంటుంద‌న్నారు. ఈ రెండు నెల‌లు ప్ర‌జ‌లు, ముఖ్యంగా వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *