బడ్జెట్లో అధికారులు, పాలకవర్గం కుమ్మక్కు
అసలు విషయాన్ని బయటపెట్టిన ఆత్మకూరు సీపీఎం నేతలు
రూ.1.35 కోట్ల నిధులు స్వాహా
- బడ్జెట్లో అధికారులు, పాలకవర్గం కుమ్మక్కు
- అసలు విషయాన్ని బయటపెట్టిన ఆత్మకూరు సీపీఎం నేతలు
పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై కోటి 35 లక్షల రూపాయల నిధుల స్వాహా చేశారని ఆత్మకూరు సీపీఎం నాయకులు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ సంధాని, సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక బడ్జెట్లో అధికారులు, పాలకవర్గం ఎలాంటి పనులు చేయకుండా ఆయా పనులకు ఇంత ఖర్చు చేశామంటూ సుమారు కోటి 35 లక్షల నిధులు స్వాహా చేశారన్నారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరులో అంత నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చూపించాలంటూ వారు నిలదీశారు. ఈ విషయమై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్యనగర్ కార్యదర్శి శ్రీను, సీపీఎం నాయకులు రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.