జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థిని..

విద్యార్థినికి అభినంధనలు వెల్లువ

ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తి సాము పోటీలలో తిరుపతి జిల్లా విద్యార్థిని సత్తా చాటింది. జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా బక్కమంతల సుధీక్ష తోలుతా జిల్లా స్థాయిలో జరిగిన కత్తి సాము పోటీలలో తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో తమ ప్రతిభను మరోసారి కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తి సాము పోటీలలో విజయం సాధించిన ఎదురు లేని విజేతగా బక్కమంతల సుధీక్ష నిలిచారు. దింతో విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *