విజయవాడలో మంత్రి నారాయణ వెల్లడి
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వ స్థలాలు
విజయవాడలో మంత్రి ఆధ్వర్యంలో సమావేశమైన నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి
నుడాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దామన్న కోటంరెడ్డి
నుడాతో జిల్లా సమగ్ర అభివృద్ధి
- విజయవాడలో మంత్రి నారాయణ వెల్లడి
- నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వ స్థలాలు
- విజయవాడలో మంత్రి ఆధ్వర్యంలో సమావేశమైన నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి
- నుడాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దామన్న కోటంరెడ్డి
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నెల్లూరు జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్లానింగ్ రూపొందిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. విజయవాడలో జరిగిన సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, VC సూర్యతేజ హాజరవ్వగా.. టెలికాన్ఫరెన్స్ ద్వారా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి నుడాకు కేటాయించాలని ఆదేశించారు. లేఅవుట్ ద్వారా వచ్చిన నిధులను ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ స్థలాలను గుర్తించి నుడాకి సమాచారం ఇచ్చామన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పొంగూరు నారాయణ నాయకత్వంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నీ నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీటీసీపీ విద్యుల్లత, CPO హిమబిందు, నుడా సిబ్బంది పాల్గొన్నారు.