నెల్లూరులో దోపిడీ దొంగ‌ల బీభ‌త్సం

ఎక్స్‌ప్రెస్ రైళ్లే టార్గెట్‌ -ఛండీఘ‌ర్‌, హౌరాలో భారీ దోపిడీ

రైళ్ల సిగ్న‌ల్స్ ట్యాంప‌రింగ్ చేసి అల్లూరు వ‌ద్ద ట్రైన్ల‌ను నిలిపేసిన ముఠా

మ‌హిళ‌ల మెడ‌లో బంగారు ఆభ‌ర‌ణాలు, బ్యాగుల చోరీ

ఛండీఘ‌ర్ ఎక్స్‌ప్రెస్‌లోనే ఎక్కువ దోపిడీ

ఆరు నుంచి 10 మంది దొంగ‌లున్న‌ట్లు స‌మాచారం

వివ‌రాలు దాస్తున్న రైల్వే పోలీసులు

గ‌తంలోనూ ప్ర‌కాశం-నెల్లూరు జిల్లాల్లో ఇదే త‌ర‌హాలో దోపిడీలు

నెల్లూరులో దోపిడీ దొంగ‌ల బీభ‌త్సం..!
-ఎక్స్‌ప్రెస్ రైళ్లే టార్గెట్‌
-ఛండీఘ‌ర్‌, హౌరాలో భారీ దోపిడీ
-రైళ్ల సిగ్న‌ల్స్ ట్యాంప‌రింగ్ చేసి అల్లూరు వ‌ద్ద ట్రైన్ల‌ను నిలిపేసిన ముఠా
-మ‌హిళ‌ల మెడ‌లో బంగారు ఆభ‌ర‌ణాలు, బ్యాగుల చోరీ
-ఛండీఘ‌ర్ ఎక్స్‌ప్రెస్‌లోనే ఎక్కువ దోపిడీ
-ఆరు నుంచి 10 మంది దొంగ‌లున్న‌ట్లు స‌మాచారం
-వివ‌రాలు దాస్తున్న రైల్వే పోలీసులు

గ‌తంలోనూ ప్ర‌కాశం-నెల్లూరు జిల్లాల్లో ఇదే త‌ర‌హాలో దోపిడీలు

రైళ్ల సిగ్న‌ల్స్‌ను ట్యాంప‌రింగ్ చేసి.. వారు అనుకున్న స్టేష‌న్ స‌మీపంలో రైళ్ల‌ను ఆపేసి.. రైళ్ల‌ల్లోని ప్ర‌యాణికుల‌ను నిలువు దోపిడీ చేసే ముఠా నెల్లూరులో తిష్ట వేసిందా.? సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని.. దోపిడీల‌కు స్కెచ్ వేశారా.? ఆ ప్రకార‌మే.. జిల్లాలోని అల్లూరు.. ప‌డుగుపాడు స్టేష‌న్ మ‌ధ్య‌లో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటాక.. విజ‌య‌వాడ వైపు నుంచి చెన్నై వెళ్లు ఛండీఘ‌డ్‌, హౌరా ఎక్స్ ప్రెస్‌ల‌లో దోపిడీల‌కు పాల్ప‌డ్డారా..? ఇప్పుడిదే.. అంద‌రి మ‌దిలో మెదులుతున్న సందేహం.

ఈ దోపిడీ ముఠా.. ముందుగా.. ఛండీఘ‌ర్ రైలును ఆపేసి.. ఎస్‌- సీరీస్ బోగీల‌ల్లోని మ‌హిళ‌లు, పిల్ల‌లు, వృద్ధుల మెడ‌ల్లోని విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌లు, చివ‌ర‌కు తాళిబొట్టుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా లాక్కెళ్లారు. కొంద‌రు ప్ర‌తిఘ‌టిస్తే.. ఆ దొంగ‌లు కింద‌కు దిగి.. రాళ్ల‌తో కొంద‌రిపై దాడికి పాల్ప‌ట్టు తెలుస్తోంది.ఇలా ఓ అర‌గంట‌పాటు బీభ‌త్సం సృష్టించారు. ఆ రైలు వెళ్లాక‌.. మ‌రో అర‌గంట‌ల‌కు హౌరా ఎక్స్ ప్రెస్‌ను కూడా ఆపి.. అందులోనూ దోపిడీకి య‌త్నించిట్లు తెలుస్తోంది. అయితే.. రైల్వే పోలీసులు మాత్రం పొంత‌న లేని స‌మాధానాలు చెప్తున్నారు. ఈ దోపిడీపై స‌రైన క్లారిటీ ఇవ్వ‌డంలేదు.

ఈ త‌ర‌హాలో దోపిడీల‌కు పాల్ప‌డే ముఠాలు చెన్నై, మ‌హారాష్ట్ర‌, నార్త్ వైపున ఉన్న రాష్ట్రాల్లోనే ఉంటార‌ట‌. వీరు ఈ దోపిడీల‌కు స్కెచ్ వేస్తే.. క‌నీసం వారం ముందు నెల్లూరులో దిగి ఉండాలి. వారు ప‌క్క‌గా సిగ్న‌ల్స్‌ను ట్యాంప‌రింగ్ చేయాలి. అందుకు అనువైన స్టేష‌న్‌ల ప‌రిధిని ఎంచుకోవాల‌ని.. అందుకు కొంత క‌స‌ర‌త్తు ఉంటుంది. ఈ స‌మ‌యంలో ఈ నిఘా వ్య‌వ‌స్థ‌లు ఏమ‌య్యాయ్యి..? ఏం చేస్తున్నాయి..? ఇత‌ర రాష్ట్రాల నుంచి నెల్లూరుకు వ‌చ్చి తిష్ట వేసి.. మ‌రీ ఈ దోపిడీల‌కు పాల్ప‌డ్డారంటే.. నిఘా వ్య‌వ‌స్థ‌ల వైఫ‌ల్య‌మా..? కాదా..? రైళ్ల ప‌ట్టాల‌పై సాంకేతిక స‌మ‌స్య‌ను సృష్టించి మ‌రీ ఆ రెండు రైళ్ల‌ల్లో దోపిడీ చేశారంటే.. రైల్వే టెక్నిక‌ల్ వ్య‌వ‌స్థ ఏమైన‌ట్లు.. సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ ట్యాంపరింగ్ అయితే.. రైల్వే పోలీసుల‌ను ఎందుకు వెంట‌నే అప్ర‌మ‌త్తం చేయ‌లేదు..? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దోపిడీ దొంగ‌లు అప్‌గ్రేడై.. టెక్నాల‌జీ సాయంతో దోపిడీల‌కు పాల్ప‌డుతుంటే.. మ‌న రైల్వే, పోలీసు నిఘా వ్య‌వ‌స్థ‌లు ఇంకా ఎక్క‌డేసిన గొంగ‌ళి అక్క‌డేన్నందుకు ఈ దోపిడీలు ఓ ఉదాహ‌ర‌ణగా తెలుస్తోంది. గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో తెట్టు.. సింగ‌రాయ‌కొండ‌.. కొడ‌వ‌లూరు.. మ‌నుబోలు ప్రాంతాల్లోనూ దోపిడీలు జ‌ర‌గ‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *