కొవ్వొత్తుల‌తో క్రైస్త‌వుల నిర‌స‌న‌

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి

కోవూరు బ‌జారు సెంట‌ర్ లో మాన‌వ‌హారం

కొవ్వొత్తుల‌తో క్రైస్త‌వుల నిర‌స‌న‌…

  • పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి
  • కోవూరు బ‌జారు సెంట‌ర్ లో మాన‌వ‌హారం

నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిరసన తెలుపుతూ… క్రైస్తవ సోదరులు ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నుండి బజారు సెంట్రల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బజార్ సెంటర్లో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ క్రైస్తవులు కూడా భారత దేశ పౌరులని.. క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదన్నారు. భారత దేశంలో సువార్త ప్రకటించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమ‌గ్ర‌ విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు….ఈ కార్యక్రమం లో 32 చర్చి ల నాయకులు, మరియు పాస్టర్లు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *