చర్యలు తప్పవని హెచ్చరించిన మైనింగ్ ఆర్ఐ స్వాతి
రెండు లారీలు, ఒక టిప్పర్ సీజ్ – పోలీస్ స్టేషన్ కు తరలింపు
అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ కొరఢా…
- చర్యలు తప్పవని హెచ్చరించిన మైనింగ్ ఆర్ఐ స్వాతి
- రెండు లారీలు, ఒక టిప్పర్ సీజ్
- పోలీస్ స్టేషన్ కు తరలింపు
యాంకర్ పార్ట్ :
అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ పై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు లారీలు, ఒక టిప్పరు స్వాధీనం చేసుకొని సోమశిల ప్రాజెక్టు పోలీసుస్టేషన్కు తరలించినట్లు మైనింగ్ ఆర్ఐ స్వామి తెలిపారు.
వాయిస్ వోవర్ :
ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని మైనింగ్ ఆర్ఐ స్వాతి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం, పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మైనింగ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో రెండు లారీలు, ఒక టిప్పరు ను స్వాధీనం చేసుకుని.. సోమశిల ప్రాజెక్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పడమటి కంభంపాడు రీచ్ లో తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవనీ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట మైనింగ్ టీఏ వాణిశ్రీ, కానిస్టేబుల్ మోహన్, తదితరులు ఉన్నారు.