యాక్సిడెంట్ కాదు… హ‌త్యే

క‌లువాయిలో క్రైస్త‌వులు నిర‌స‌న‌

యాక్సిడెంట్ కాదు…హ‌త్యే

  • క‌లువాయిలో క్రైస్త‌వులు నిర‌స‌న‌…

ఫాస్ట‌ర్ ప‌గ‌డాల ప్ర‌వీణ్ మృతికి నిర‌స‌న‌గా… నెల్లూరు జిల్లా క‌లువాయి మండ‌లంలో క్రైస్త‌వువులు ఆందోళ‌న చేప‌ట్టారు. నెల్లూరు జిల్లా డిస్టిక్ ఫాస్ట‌ర్స్ ఫెలోషిప్ ఆధ్వ‌ర్యంలో స్థానిక క‌రెంట్ ఆఫీస్ నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. ఫాస్ట‌ర్ హ‌త్య‌కు కార‌కులైన వారికి వెంట‌నే శిక్షించాల‌ని క్రైస్త‌వులు డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా పాస్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ… ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హ‌త్యేన‌ని… ఆక్సిడెంట్ కాదన్నారు. కొందరు దుండగులు అతనిని హత్య చేసి…యాక్సిడెంట్ గా చిత్రీక‌రించార‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం, పోలీసులు విచారించి హ‌త్య‌కు పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్త‌వ సోద‌రులు సంపత్ కుమార్, జాన్ భాస్కర్, రవి, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *