కావలిలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ

పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్

కావలిలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ

  • పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆదివారం రాత్రి క్రైస్తవ సోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కావలి ఐకాన్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ వరకు తిరిగి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ చేశారు. రాజమండ్రి వెళుతూ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో మానవహారం చేపట్టారు. ఆయన మృతిపట్ల న్యాయ విచారణ జరగాలని న్యాయవాది,,పాస్టర్ శివప్రసాద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలోజే.ఏ.సి సభ్యులు యేసుబాబు , పాడేటి థామస్, విన్సెంటు , ఇర్మియా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *