లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని పంపిణీ చేసిన మంత్రి నారాయణ
15 మందికి రూ. 17.82 లక్షలు పంపిణీ
- లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని పంపిణీ చేసిన మంత్రి నారాయణ
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని…నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని… రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు మెడికల్ కాలేజ్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని… ఈరోజు 15 మంది లబ్ధిదారులకి రూ. 17 లక్షల 82వేల 382 విలువ చేసే చెక్కులను అందచేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు…రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు