చలివేంద్రాన్ని ప్రారంభించిన 16వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి మదన్కుమార్రెడ్డి
కాంచీపురం పెరుమాళ్ సిల్స్
ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం
- చలివేంద్రాన్ని ప్రారంభించిన 16వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి మదన్కుమార్రెడ్డి
ఉగాది పండుగను పురస్కరించుకొని… నెల్లూరులోని కాంచీపురం పెరుమాళ్ సిల్స్ భయ్యా వెంకటరమణయ్య, భయ్యా సరోజనమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 16వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి నూకరాజు మదన్కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మదన్కుమార్ రెడ్డి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకి, సిబ్బందికి అందచేశారు. అనంతరం మదన్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… నెల్లూరు నగర ప్రజలందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భయ్యా వెంకటరమణయ్య, భయ్యా సరోజనమ్మ మెమోరియల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్నారు. ఎండా కాలం ముగిసేంత వరకు రోజుకి సుమారు 500 మందికి మజ్జిగ పంపిణీ చేయాలన్న నిర్ణయం ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీధర్రెడ్డి, భయ్యా రవి, భయ్యా రంగవల్లిక, యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.