తీరిన రైతుల ఉమ్మడి బండ్ల బాట సమస్య
స్పందించిన తహసీల్దార్, ఎస్ఐ
కృతజ్ఞతలు తెలియజేసిన రైతులు
రెండేళ్ల సమస్యకు పరిష్కారం…
- తీరిన రైతుల ఉమ్మడి బండ్ల బాట సమస్య
- స్పందించిన తహసీల్దార్, ఎస్ఐ
- కృతజ్ఞతలు తెలియజేసిన రైతులు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని పాములువారి పాలెం గ్రామం లో గత రెండేళ్లుగా…ఉమ్మడి బండ్ల బాట సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి బండ్ల బాటను తాండ్ర మీరయ్య అనే రైతు గత ప్రభుత్వ హయాంలో సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లించి నకిలీ పత్రాలను సృష్టించుకున్నారని రైతులు ఆరోపించారు. చుట్టుపక్కల రైతులకు రెండు సంవత్సరాల నుండి రైతులకు రాకపోకలు లేకుండా కంచె వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఇందుకు తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎస్ఐ నాగార్జునరెడ్డిలు స్పందించారు. బండ్ల బాట వద్ద కంచె తొలగించి రైతులకు ఉమ్మడి బండ్ల బాట హక్కును కల్పించారు. పాములవారిపాలెం రైతులు బండ్ల బాట సమస్యను పరిష్కరించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.